బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ దూకుడుని అడ్డుకుంటామన్నారు. బీజేపీ నేతలు మాపై మొరగడం కాదు.. మీ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని సూచించారు. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు..కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు ఏకతాటిపైకి రావడం రాజకీయ పార్టీలకి నచ్చదని పేర్కొన్నారు.

గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటి...

భారతదేశంలో బీబీసీ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై నిషేధించడంపై ఓవైసీ ప్రశ్నల వర్షం కురింపించారు. 'గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా మీరే ఉన్నారు కదా..! గాడ్సే..గాంధీ హంతకుడు. అసలు గాడ్సేపై మీ నిర్ణయం ఏంటి..?'అని ప్రధాని నరేంద్రమోడీతో పాటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(గాంధీ కుటుంబం)ని ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాని చిత్రికరిస్తున్నారు, గాంధీ హంతకుడిపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్‌ చేస్తారా? లేదా? అని నిలదీశారు.

మీ గురించి, బీజేపీ గురించి ప్రచారం చేస్తోన్న వార్తని బ్యాన్‌ చేస్తున్నారు. మరి గాడ్సేపై తీయబోతున్న సినిమాని భారతదేశంలో బ్యాన్‌ చేస్తారా? లేదా? అన్నారు. మరోవైపు, హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి తల్వార్లు, కత్తులతో దాడులు చేస్తున్న వారిని ఉక్కు పాదంతో అణిచివేయాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. నిందితులకు శాశ్వతంగా బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read...

దూకుడు పెంచిన BJP.. కీలక సమావేశానికి మహబూబ్ నగర్ రెడీ


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed